టిబెట్కు చెందిన ధార్మిక నేత దలైలామాకు జాతీయ సివిల్ రైట్స్ మ్యూజియం ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్వాతంత్ర్య పురస్కారాన్ని ఇవ్వనుంది.
దలైలామాకు వాషింగ్టన్కు చెందిన జాతీయ సివిల్ రైట్స్ మ్యూజియం అంతర్జాతీయ స్వాతంత్ర్య పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు నేషనల్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ బోర్డ్ అధ్యక్షుడు బెంజిమన్ ఎల్ హూక్స్ తెలిపారు.
ఈ పురస్కారాన్ని వచ్చే నెల సెప్టెంబరు 23న దలైలామాకు అందజేయనున్నామని బెంజిమన్ తెలిపారు. దలైలామా మార్టిన్ లూథర్ కింగ్ మరియు మహాత్మాగాంధీలాంటి అహింసా మూర్తులలో ఈయన కూడా ఒకరని ఆయన దలైలామాను కొనియాడారు.