పాక్ తాలిబాన్ అధినేతగా మౌల్వీ

పాకిస్తాన్ తాలిబన్ అధినేతగా మిలిటెంట్ కమాండర్ మౌల్వీ ఫకీర్ తనను తాను ప్రకటించుకున్నాడు. తాత్కాలికంగా బైతుల్లా మెహసూద్ స్థానంలో పని చేయనున్నట్లు ఆయన తెలిపాడు.

బైతుల్లా మెహసూద్ అమెరికా దాడుల్లో మరణించినట్లు దాదాపుగా నిర్ధారణ అయినట్లేనని ఫకీర్ మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి తెహ్రీక్ - ఎ - తాలిబన్ నేతగా తాను వ్యవహరిస్తున్నట్లు ప్రకటించుకున్నాడు.

మెహసూద్ మరణించినా తాలిబన్వ ఉద్యమం ఆగదని ఆయన అన్నాడు. మిలిటెంట్ వర్గాలను సంప్రదించకుండా వలీ-ఉర్ - రెహ్మాన్‌కు గానీ హకీముల్లా మెహసూద్‌కు గానీ కొత్త నేతను ఎన్నుకునే హక్కు లేదని ఫకీర్ ఈ సందర్భంగా అన్నాడు.

వెబ్దునియా పై చదవండి