పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్పై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో మరో కేసు దాఖలైంది. ఆయన సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ ద్రోహానికి పాల్పడటమే కాకుండా.. రాజ్యాంగాన్ని ధిక్కరించి దేశంలో ఎమర్జెన్సీని విధించారన్నది తాజా ఆరోపణ. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ.. ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ నేత జాఫర్ అలీ షా సుప్రీం కోర్టులో శనివారం పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లో ముషారఫ్ను దేశద్రోహం, రాజ్యాంగాన్ని ధిక్కరించినందుకు దర్యాప్తు చేపట్టవలసిందిగా అధ్యక్షుడు జర్దారీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ కేసులో నేరం రుజువైన పక్షంలో ముషారఫ్కు మరణశిక్షపడే అవకాశం ఉంది. ముషారఫ్ 2007లో విధించిన అత్యవసర పరిస్థితి చెల్లదని, రాజ్యాంగ వ్యతిరేకమని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే.
ఇదిలావుండగా, సింధ్ కోర్టులో మరో కేసు దాఖలైంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులను చేపట్టిన ఆందోళనలో 40 మంది హత్యకు ముషారఫ్ కారణభూతుడయ్యాడంటూ శనివారం పంజాప్ ప్రావీన్స్ మాజీ ముఖ్యమంత్రి పిటీషన్ దాఖలు చేశారు.