పోర్చుగల్‌లో స్వైన్ ఫ్లూ: 24 గంటల్లో 149 కేసులు

యూరప్‌లో పోర్చుగల్ దేశాన్ని ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. గత 24 గంటల్లో ఈ దేశంలో 149 కేసులు నమోదయ్యాయి. దీంతో మే నెల నుంచి ఇప్పటివరకు నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 884కి పెరిగిందని పోర్చుగల్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

తాజాగా ఒక్క రోజులోనే 149 కేసులు నమోదవడం ఆరోగ్య శాఖను కలవరపెడుతోంది. ఇన్ని కేసులు 24 గంటల్లో నమోదవడంతో అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే పోర్చుగల్‌లో ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఎ(హెచ్1ఎన్1) వైరస్ బారినపడి 11 మంది ఆస్పత్రి పాలైనట్లు పోర్చుగల్ ఆరోగ్య శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి