బర్మాలో విడుదలైన ఖైదీకి వైద్య పరీక్షలు

మయన్మార్ నిర్బంధం నుంచి విడుదలైన అమెరికా ఖైదీకి బ్యాంకాక్‌లో సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏడు నెలలపాటు మయన్మార్ పాలకులు అమెరికా చెందిన 53 ఏళ్ల జాన్ యెట్టావ్‌ను నిర్బంధించారు. మయన్మార్ ప్రజాస్వామ్య నేత అంగ్ సాన్ సూకీ నివాసంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు మయన్మార్ పాలకులు యెట్టావ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

గత మూడు నెలలుగా ఈ అమెరికా పౌరుడు మయన్మార్ జైలులో ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో బ్యాంకాక్‌లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అమెరికాకు చెందిన ఓ సెనెటర్ నెరిపిన దౌత్యం ఫలించడంతో యెట్టావ్ విడుదలయ్యారు. అనంతరం థాయ్‌లాండ్ రాజధానికి చేరుకున్న యెట్టావ్ ఆస్పత్రి పాలైయ్యారు.

యెట్టావ్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు బ్యాంకాక్‌లోని అమెరికా దౌత్యాధికారులు నిరాకరించారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించడం తమ మొదటి ప్రాధాన్యతని చెప్పారు. అయితే యెట్టావ్‌కు ఎక్కడ వైద్యం అందిస్తున్నారో వెల్లడించేందుకు అమెరికా అధికారులు నిరాకరించారు. ఆయన స్వదేశానికి ఎప్పుడు వెళతారనే దానిపై కూడా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

వెబ్దునియా పై చదవండి