భార్యను కిరాతకంగా చంపి.. ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టిన భర్త!

శుక్రవారం, 9 ఆగస్టు 2013 (14:18 IST)
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఓ కిరాతక భర్త తన భార్యతో గొడవపడి కోపంతో ఆమెను అత్యంత కిరాతంగా చంపేశాడు. అంతేకాకుండా రక్తపు మడుగులో పడిఉన్న ఆమె ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి.... అమెరికాకు చెందిన 31 ఏళ్ల మదీనా అతని భార్య జెన్నిఫర్ అల్ఫోన్సో(21) ఇద్దరిమధ్య గురువారం చిన్న వాగ్వివాదం జరిగింది. మాటామాటాపెరిగి వారిద్దరు గొడవకు దిగారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మదీనా కత్తితో ఆమెపై దాడిచేసి అతి కిరాతకంగా చంపేశాడు.

అంతేకాకుండా కిచెన్ రూమ్‌లో రక్తపు మడుగులో పడివున్న ఆమెను కెమేరాలో బంధించి, ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. తనకూ తన భార్యకు గొడవయ్యిందనీ, అందుకే ఆమెను చంపేశాననీ, తనను అర్థం చేసుకోవాలని, ఇకపై మీతో ఛాట్ చేయడం కుదరదనీ, ఎందుకంటే తను ఇక జైలుకు వెళ్లడం ఖాయమనీ, కాబట్టి మీ అందరికీ గుడ్‌బై... ఫ్రెండ్స్ అంటూ పోస్ట్ చేశాడు.

వెబ్దునియా పై చదవండి