ముషారఫ్‌పై దేశద్రోహం కేసు: పాక్ సన్నాహాలు

పాకిస్థాన్ మాజీ మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ త్వరలోనే కష్టకాలం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్ ప్రభుత్వం ముషారఫ్‌పై దేశద్రోహం కేసు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. రెండేళ్ల క్రితం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముషారఫ్ దేశంలో అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించినందుకు పాక్ ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని భావిస్తోంది.

దీనిపై త్వరలోనే పాక్ పార్లమెంట్ తీర్మానం చేయనుందని కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు. 2007లో ముషారఫ్ పాక్‌లో ఎమర్జెన్సీ విధించడంతోపాటు, కీలక న్యాయమూర్తుల తొలగింపు, వారి స్థానాల్లో కొత్తవారి నియమాకాలు, రాజ్యంగ సవరణలు చేయడం, తదితర వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమేనని ఇటీవల పాక్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఈ నిర్ణయాలన్నీ అక్రమమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ముషారఫ్ భవితవ్యాన్ని తేల్చే బాధ్యతలను పాకిస్థాన్ పార్లమెంట్‌కు అప్పగించింది. సుప్రీంకోర్టు సూచనలన ఆధారంగా చేసుకొని జాతీయ అసెంబ్లీ త్వరలోనే తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు పాక్ న్యాయ శాఖ సహాయమంత్రి అఫ్జల్ సింధూ తెలిపారు. ముషారఫ్‌తోపాటు, ఆయన అనుయాయులుపై దేశద్రోహం కేసులు పెట్టేందుకు ఈ తీర్మానం తీసుకొస్తామని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి