లంకనుంచి పెద్దపులి కుటుంబం పరారీ

ఎల్‌టీటీఈ నేత వేలు పిళ్ళై ప్రభాకరన్ శ్రీమతి, తన ఇద్దరు పిల్లలు శ్రీలంక వదిలి పారిపోయారు. ప్రస్తుతం శ్రీలంక సైన్యం ఎల్‌టీటీఈ స్థావరాలలోకి చొరబడి ఎల్‌టీటీఈకి చెందిన బంకర్లు, వారి రహస్య స్థావరాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

గూఢచారుల సమాచారంమేరకు ప్రభాకరన్ మాత్రం ఇంకా తన స్థావరంలోనేవున్నట్లు తెలిసింది. కాని అతని సతీమణి మరియు అతని ఇద్దరు పిల్లలు మాత్రం దేశంవదిలి పారిపోయారని ఒక ప్రకటనలో ఆ ప్రభుత్వం ప్రకటించింది.

ఎల్‌టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళానికి చెందిన ఒక వ్యక్తిని గత నెలలోనే అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అతనిని విచారించి విచారణాధికారుల సమాచారం మేరకు ప్రభాకరన్ పెద్ద కుమారుడు చార్లెస్ ఆంటోనీ ఇంకా శ్రీలంకలోనేవున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి