పాక్ కింగ్ మైకేల్ జాక్సన్ ప్రాథమిక వైద్య సిబ్బంది రాకకు గంట ముందే మరణించిన తాజాగా వెల్లడైన ఆంబులెన్స్ నివేదికలో పేర్కొన్నారు. ప్రథమ చికిత్స అందించే సిబ్బంది మైకేల్ జాక్సన్ ఇంటికి చేరుకోవడానికి గంట ముందుగానే ఈ ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ కన్నుముశారని ఈ నివేదిక వెల్లడించింది.
మత్తునిచ్చే ప్రొపోఫోల్ అనే మందు తీసుకున్న అనంతరం గుండె పోటుతో మైకేల్ జాక్సన్ (50) కన్నుమూసిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజెలెస్లోని తన అద్దె నివాసంలో గత నెలలో వైద్యులు సూచించిన మాత్రలతోపాటు, ఈ మత్తుమందును కూడా మైకేల్ తీసుకున్నారు.
తాజాగా ఆయన మరణంపై అమెరికా ప్రాథమిక వైద్య సిబ్బంది తయారు చేసిన నివేదిక బహిర్గతం కావడంతో మరిన్ని అనుమానాలు బయలుదేరాయి. మైకేల్ జాక్సన్ తాము వెళ్లడానికి గంట ముందే మరణించారని ప్రాథమిక వైద్య సిబ్బంది తయారు చేసిన నివేదికలో వెల్లడించారు. ఈ నివేదిక ఏడు వారాల క్రితమే సిద్ధమైనప్పటికీ, మైకేల్ మరణంపై దర్యాప్తు జరుగుతున్న కారణంగా దీనిని బహిర్గతం చేయలేదు.