సిడ్నీలోని జుహీ బీచ్‌లో మరో భారతీయునిపై దాడి

మంగళవారం, 12 జనవరి 2010 (11:23 IST)
ఆస్ట్రేలియాలోని భారతీయులు అక్కడ ఉన్నంత కాలం అభద్రతాభావంతోనే దైనందిన జీవితం గడపాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడ నివశించే భారతీయులపై జరగుతున్న దాడులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కరుడుగట్టిన జాతివివక్షతో రగిలి పోతున్న ఆస్ట్రేలియన్లు పొట్టకూటి కోసం అక్కడ నివశిస్తున్న భారతీయులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా అంటే.. మంగళవారం ఉదయం మరో దాడి జరిగింది. ఆసీస్‌లోని ముఖ్య నగరాల్లో ఒకటైన సిడ్నీలోని ప్రఖ్యాత జుహీ బీచ్‌లో 28 సంవత్సరాల వ్యక్తిగా ఈ దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాడి చేసిన వారిలో కొంతమంది మహిళలు కూడా ఉండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి