సరిగ్గా 59 సంవత్సరాల క్రితం భారత్, నేపాల్ల మధ్య కుదిరిన శాంతి మరియు స్నేహ ద్వైపాక్షిక ఒప్పందాలను సమీక్షించేందుకు ఇరు దేశాలు అంగీకారం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో హిమాలయా ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా సమీక్షించాలని భారత్, నేపాల్ నిర్ణయించాయి.
అంతకుముందు 1950లో భారత్, నేపాల్ల మధ్య ఈ శాంతి, స్నేహ ఒప్పందం కుదిరింది. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లోను భారత్ జోక్యం చేసుకునేలా ఈ ఒప్పందం ఉన్నట్లు ఇటీవల విమర్శలు వస్తుండటంతో.. దీన్ని ప్రస్తుతం సమీక్షించాల్సిన అవసరం ఉందని ఇరు దేశాలు భావించాయి.
నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ నాయర్ ఐదు రోజుల పాటు భారత్లో పర్యటన ముగుస్తున్న నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి భారత్, నేపాల్లు ఓ సంయుక్త ప్రకటనను చేశాయి. భారత్, నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శులు 1950 నాటి శాంతి, స్నేహ ఒప్పందంపై సమీక్షించనున్నట్లు తెలిపాయి.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేలా ఈ సమీక్ష ఉంటుందని సమాచారం. భారత్పై వ్యతిరేక కార్యకలాపాలను సాగించేందుకు తమ భూభాగంలోకి ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని మాధవ్ కుమార్.. భారత ప్రధాని మన్మోహన్ సింగ్తో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చారు.