ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొన్ని దిశానిర్దేశాలను రూపొందించింది. ఈ దిశానిర్దేశాలను ప్రపంచంలోని వైద్య ప్రముఖులు రూపొందించారు. వారు రూపొందించి ఆమోదించిన దిశానిర్దేశాలు ఇలా ఉన్నాయి...
స్వైన్ ఫ్లూ వ్యాధిబారిన పడినవారి పరిస్థితి గంభీరంగా తయారై ఉంటే వారికి యాంటీ వైరల్ మందులు తప్పకుండా వాడాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి క్రిములు ప్రాకినట్లు కనపడుతోందని కాని ఎలాంటి మందులు లేకుండానే ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చంటున్నారు వైద్యనిపుణులు.
స్వైన్ ఫ్లూ మహమ్మారి వ్యాధి బారిన పడినవారు ఓసేల్టామీవీర్ మరియు జేనామీవీర్లాంటి మందులను వాడాలని సూచించారు. ఈ మందులు స్వైన్ ఫ్లూ మహమ్మారిని నిరోధించేందుకు తోడ్పడి ప్రాణాలను కాపాడుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.
ముందుగా వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాతనే ఈ మందులను వాడాలని వారు సూచించారు. ఈ మందులను వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన పనిలేదని వారు తెలిపారు.
నిమోనియాను నిరోధించేందుకు ఓసేల్టామీవీర్ బాగా పని చేస్తుంది. నిమోనియా మరియు వాతావరణంలో వ్యాపించియున్న ఇన్ఫ్లూయెంజాలో విపరీతమైన విషకీటాణువులున్నాయని వైద్య ప్రముఖులు తెలిపారు. ఈ కీటకాలు ప్రాణానికి హాని తలపెట్టేటివిగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ఎక్కడైతే ఓసేల్టామీవీర్ దొరకదో అక్కడ జేనామీవీర్ ఔషధాన్ని ఉపయోగించవచ్చని వైద్యులు సూచించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ వ్యాధిబారిన పడినట్లు కనిపిస్తే వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించి యాంటీ వైరల్కు సంబంధించిన ఔషధాలను వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ముఖ్యంగా ఐదు సంవత్సరాలలోపున్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఐదు సంవత్సరాలపైనున్న పిల్లల్లోను ఈ వ్యాధి సంక్రమిస్తే వారికి యాంటీ వైరల్ చికిత్స చేయవచ్చని వైద్యులు సూచించారు.