ఎవరో అనుకుని.. అర్థరాత్రి చీకట్లో కన్నతల్లిపై అత్యాచారం.. తీరా తెలిశాక షాక్!

మంగళవారం, 4 జూన్ 2019 (14:52 IST)
అమెరికాలో ఘోరం జరిగింది. అమెరికాలో ఓ యువకుడు అర్థరాత్రి ఎవరో మహిళ అనుకుని కన్నతల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అత్యాచారానికి తర్వాత ఆమె కన్నతల్లి అని తెలుసుకుని షాకయ్యాడు.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలో విల్లేవ్లో ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల మహిళ పని ముగించుకుని రాత్రి పూట ఇంటికి వెళ్తుండగా.. ఆమెను ఎవరో అనుసరిస్తున్నట్లు గ్రహించింది. 
 
అయితే తిరిగి చూస్తే ఎవ్వరూ లేకపోయే సరికి వేగంగా నడవటం ప్రారంభించింది. ఆ సమయంలో అనూహ్యంగా ఓ వ్యక్తి ఆమెను రోడ్డుపై నుంచి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చేందుకుగాను ఆ వ్యక్తి ముఖాన్ని బాధితురాలు చూసింది. 
 
అంతే లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి తన కుమారుడేనని తెలిసి షాకైంది. దీంతో దిగ్భ్రాంతికి గురైన సదరు మహిళ కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు