చైనా, భారత్ల మధ్య సైనిక సంబంధాల పురోభివృద్ధి నేపథ్యంలో రెండు దేశాలు స్నేహహస్తాన్ని అందించుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో భారత మీడియా బృందాన్ని అక్కడి అకాడమీ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ ఇంజినీరింగ్ సైనిక సంస్థను సందర్శించేందుకు అనుమతించింది. ఈ సందర్భంగా భారత మీడియా ప్రతినిధులతో సీనియర్ కల్నల్ లియో డెగాంగ్ మాట్లాడుతూ, 'అర్జున్' మెరుగైన యుద్ధ ట్యాంకు అని పేర్కొన్నారు. భారత స్థితిగతులకు అతికినట్టు సరిపోయే ట్యాంకు అని కితాబిచ్చారు.