నైజీరియాలో బందిపోట్ల దుశ్చర్య - 43 మంది మృతి

మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:05 IST)
నైజీరియా దేశం వణికిపోతోంది. ఒకవైపు ఉగ్రవాదులు, మరోవైపు స్మగ్లర్లు, ఇంకోవైపు బందిపోట్లు. ఈ ముగ్గురు మధ్య నైజీరియన్లు నలిగిపోతున్నారు. తాజాగా బందిపోట్లు జరిపిన కాల్పుల్లో 43 మంది మృత్యువాతపడ్డారు. 
 
స్థానికంగా జరుగుతున్న సంతలో మార్కెట్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 43మంది మృతి చెందారు. నార్త్‌వెస్ట్‌లో ఉండే సకోటోలో ఈ దుర్ఘటన జరిగింది. 
 
గొరొన్యో అనే పల్లెలో ఆదివారంక కొందరు బందిపోట్లు జరిపిన కాల్పుల్లో 43మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఘటనకు కారణాలపై ఎవరెవరు పాల్గొన్నారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు