ఆ కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిసెఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘యెమెన్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా విద్య, ఆరోగ్య సంస్థల సేవలు పూర్తిగా స్తంభించాయి. ప్రజలు బాంబు దాడుల భయంతో వణికిపోతున్నారు.
ఘర్షణలు, దాడులు, ఆహారలేమి, భయాందోళనల కారణంగా 62 మంది చిన్నారులు మృతి చెందగా, 30 మంది చిన్నారులు గాయపడ్డారు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా యెమెన్లో ఉన్న భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు కేంద్రం ఒక విమానం రెండు ఓడలను పంపిన విషయం తెలిసిందే.