పక్షి పిల్ల నోటిలో సిగరెట్ ముక్క.. వైరల్ అవుతున్న ఫోటో..

బుధవారం, 3 జులై 2019 (18:40 IST)
అమెరికాలో ఓ పక్షి తన పిల్లకు సిగరెట్ బడ్స్ తినిపించే ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో బ్లాక్ స్కిమ్మర్ పక్షి.. తన పిల్లకు సిగరెట్ బడ్స్ తినిపించే ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
ఈ ఫోటో వైరల్ కావడం పక్కన బెడితే.. మానవుల తప్పిదాలను కూడా ఎత్తిచూపుతోంది. సిగరెట్‌లోని దూదిని ఆహారంగా భావించి పక్షులు తన పిల్లలకు అందించడం ద్వారా పక్షులకు మానవులు మంచి చేసిన వారవుతారా అనే కోణంలో ఈ ఫోటోపై చర్చ సాగుతోంది. 
 
గత 39 సంవత్సరాల్లో సముద్ర తీరాల్లో మాత్రం 60 మిలియన్ల సిగరెట్ బడ్స్‌ను తొలగించినట్లు ఓ అధ్యయనం తేలింది. ఈ ప్రపంచం మానవుల కోసం మాత్రమే సృష్టించబడలేదని, పక్షులు, జంతువులకు కూడా సొంతమని.. సామాజిక వేత్తలు ఈ ఫోటోను షేర్ చేస్తూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఫోటోను చూసిన తర్వాతైనా మానవులు నడుం బిగించాలని వారు హితవు పలుకుతున్నారు. ఈ ఫోటోను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కరెన్ మోసన్ తన కెమెరాలో బంధించి.. ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇకపై సిగరెట్ కాల్చితే మిగిలిన ముక్కను ఇలా పారేయకండి అంటూ విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు