వీటో పవర్ ఉన్న చైనా ఐక్యరాజ్యసమితి వేదికగా మసూద్ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత యత్నాలను అడ్డుకున్న విషయం తెల్సిందే. తొలుత సాంకేతిక కారణాలు చెప్పి మరో 6 నెలల పాటు పాత నిర్ణయానికే కట్టుబడినట్లు యూఎన్కు వెల్లడించింది. మళ్లీ ఇప్పుడు భిన్నాభిప్రాయాలంటోంది. ఈ విషయంలో ఆయా దేశాలు తగిన చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చేందుకు మరో ఆరు నెలల గడువు తీసుకున్నట్లు తెలిపింది.
ఆర్థిక సంబంధాలే కీలక పాత్ర పోషిస్తున్న ప్రస్తుత తరుణంలో చైనాకు పాకిస్థాన్ కన్నా భారతే ఎక్కువ అవసరం. అందుకే మసూద్ పట్ల చైనా ప్రేమను కురిపిస్తోంది. అయితే, మసూద్ వంటి ఉగ్రవాదిని చైనా నాయకత్వం వెనకేసుకురావడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.