చైనా బొగ్గుగనిలో ఏర్పడిన పేలుడు కారణంగా 24 మంది మృత్యువాత పడ్డారు. బొగ్గుగనిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 24 మంది కార్మికులు చనిపోయారు. ఈ ప్రమాదం చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్లో ఉన్న ఒక బొగ్గు గనిలో జరిగింది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.