చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్ .. 24 మంది బలి!

బుధవారం, 26 నవంబరు 2014 (19:20 IST)
చైనా బొగ్గుగనిలో ఏర్పడిన పేలుడు కారణంగా 24 మంది మృత్యువాత పడ్డారు. బొగ్గుగనిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 24 మంది కార్మికులు చనిపోయారు. ఈ ప్రమాదం చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్లో ఉన్న ఒక బొగ్గు గనిలో జరిగింది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థకు చెందినది. ఈ కంపెనీలో దాదాపు 5000  మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ గనిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఏడాది ఫుక్సిన్ గనిలో గ్యాస్ లీకై దాదాపు 8 మంది కార్మికులు మృతి చెందారు. 

వెబ్దునియా పై చదవండి