భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఠాగూర్

సోమవారం, 28 ఏప్రియల్ 2025 (12:08 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సులతో పాకిస్థాన్‌కు చెందిన 16 మంది యూట్యూబ్ చానెళ్లపై నిషేధం విధించింది. వీటిలో డాన్, సామా టీవీ, ఏఆర్‌వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి, ఆష్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూఖ్, బోల్ న్యూస్, రాఫ్తార్ సునో న్యూస్, పాకిస్థాన్ రిఫరెన్స్, సామా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ వంటి చానళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి సుమారుగా 6.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
 
పహల్గాం దాడి ఘటన తర్వాత ఈ చానళ్లు భారత్‌పై విషం కక్కుతున్నాయి. రెచ్గొట్టేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన తర్వాత భారత్, భారత సైన్యం, భద్రతా సంస్థలను రెచ్చగొట్టేల ఇవి వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అలాగే, సున్నితమైన కంటెంట్‌పై తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు