డ్రాగన్ కంట్రీకి మైండ్‌బ్లాంక్ : చైనా సైనికులు చూస్తుండగానే పైప్‌లైన్‌ను పూర్తిచేసిన భారత్

సోమవారం, 7 నవంబరు 2016 (09:41 IST)
డ్రాగన్ కంట్రీకి మైండ్‌బ్లాంక్ అయింది. చైనా సైనికులు చూస్తుండగానే పైప్‌లైన్‌‍ను భారత ఇంజనీర్లు పూర్తి చేశారు. ఈ పైప్‌లైన్ ద్వారా లడఖ్ డివిజన్‌లోని గ్రామాల ప్రజలకు సాగు, తాగు నీరు అందించనున్నారు. 
 
లడఖ్‌లోని దెమ్‌చోక్‌లో ఆర్మీ పైప్‌లైన్ నిర్మాణ పనులను చేపట్టింది. అయితే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇక్కడ రక్షణ అవసరాలకు తప్ప మరే ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొంటూ చైనా పీపుల్స్ ఆర్మీ ఈనెల 2న పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో భారత్ భారీ సంఖ్యలో సైనికులను మొహరించింది. 
 
దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికులు మూడు రోజులుపాటు అలాగే ముఖాముఖి నిల్చోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్టు కనిపించింది. చైనా ఆర్మీని విజయవంతంగా నిలువరించిన మన సైనికులు వారు చూస్తుండగానే పైప్‌లైన్ నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేయడంతో చైనాకు దిమ్మదిరిగింది. 

వెబ్దునియా పై చదవండి