లండన్ అండర్‌ గ్రౌండ్ రైలు క్యారేజ్‌లో మహిళ ముందు అలా...?

సెల్వి

గురువారం, 4 జనవరి 2024 (21:03 IST)
లండన్ అండర్‌ గ్రౌండ్ రైలు క్యారేజ్‌లో ఒంటరి మహిళ ముందు హస్తప్రయోగం చేసినందుకు దోషిగా తేలిన 43 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి యూకేలో తొమ్మిది నెలల జైలు శిక్ష విధించబడింది. వివరాల్లోకి వెళితే.. 
ఉత్తర లండన్‌లోని వెంబ్లీకి చెందిన ముఖేష్ షా గత నెలలో లండన్ ఇన్నర్ క్రౌన్ కోర్టులో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు దోషిగా తేలాడు. 
 
నవంబర్ 4, 2022న ట్యూబ్ జర్నీ సందర్భంగా జరిగిన ఈ ఘటనపై అతను 10 ఏళ్ల లైంగిక హాని నివారణ ఆర్డర్‌కు లోబడి ఉంటాడని బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్ (బీటీపీ) తెలిపింది. "ఇది బాధితురాలికి భయపెట్టే, కలత కలిగించే అనుభవంగా మారింది. ఈ చర్యతో ఆయన కటకటాల వెనుక నెట్టింది. భవిష్యత్తులో అతని చర్యలను పునరావృతం చేయకుండా నిరోధించడానికి అతని విడుదల తర్వాత పరిమితులు విధించడం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు