ఇండోనేషియాలోని తైమూర్‌లో భారీ భూకంపం

గురువారం, 23 నవంబరు 2023 (13:30 IST)
ఇండోనేషియాలోని తైమూర్‌లో భారీ భూకంపం ఏర్పడింది. గురువారం తెల్లవారుజామున 2.34 గంటలకు తైమూర్‌ దీవులకు సమీపంలోని కుపాంగ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 6.1గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.
 
పశ్చివ నుసా టెంగారా ప్రావిన్స్‌ రాజధాని కుపాంగ్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ముప్పు లేదని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు