సద్దాం ప్రాభవం కొనసాగిన కాలంలో మొత్తం 76 అందమైన భవంతులు నిర్మించారు. వాటిలో కృత్రిమ సరస్సులు, పార్కులు ఏర్పాటు చేశారు. ఈ భవంతుల్లో అత్యధికం టైగ్రిస్ నదీ తీరంలో నిర్మించారు. సద్దాంను బందీగా పట్టుకున్న తర్వాత ఈ భవంతులను ఇరాకీ వర్గాలు ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక కేంద్రాలుగా వినియోగిస్తున్నాయి.