ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ భవంతులు నేలమట్టం!

శుక్రవారం, 30 జనవరి 2015 (16:04 IST)
ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ భవంతులను ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూపు పేల్చేసింది. తిక్రిత్ పట్టణంలో ఆయనకు చెందిన 9 విలాసవంతమైన భవంతులను ఐఎస్ మిలిటెంట్లు నేలమట్టం చేసినట్టు ఇరాక్ భద్రత విభాగానికి చెందిన అధికారులు తెలిపారు. 
 
సద్దాం ప్రాభవం కొనసాగిన కాలంలో మొత్తం 76 అందమైన భవంతులు నిర్మించారు. వాటిలో కృత్రిమ సరస్సులు, పార్కులు ఏర్పాటు చేశారు. ఈ భవంతుల్లో అత్యధికం టైగ్రిస్ నదీ తీరంలో నిర్మించారు. సద్దాంను బందీగా పట్టుకున్న తర్వాత ఈ భవంతులను ఇరాకీ వర్గాలు ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక కేంద్రాలుగా వినియోగిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి