దీనిపై జాన్ కెర్రీ వాషింగ్టన్లో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో మోడీ అభివృద్ధి అజెండా గురించి మాట్లాడుతూ, "సబ్ కా సాత్, సబ్ కా వికాస్" నినాదానికి తాము మద్దతు పలుకుతామన్నారు.
ఇదొక గొప్ప విజన్ అని నమ్ముతున్నామని పేర్కొన్నారు. భారత ఆర్ధికవృద్ధి పునరుద్ధరణకు తోడ్పడేందుకు యూఎస్ ప్రైవేట్ సెక్టార్ ఆసక్తితో ఉందని తెలిపారు. కాగా, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తో ఐదవ వార్షిక భారత్-యుఎస్ వ్యూహాత్మక చర్చలకోసం ఈ వారంలో కెర్రీ భారత్ రానున్నారు.