శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిపై రగడ రాజుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదం చిచ్చు పెట్టింది. తద్వారా ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎదురు దాడి చేశారు.