బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అనునిత్యం చొరబాట్లు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో ఎందరో బంగ్లాదేశీయులు చట్ట విరుద్ధంగా భారత్లో నివసిస్తున్నారు. దీంతో, ఈ చొరబాట్లకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్-బంగ్లా సరిహద్దులో లేజర్ గోడలను, స్మార్ట్ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది. సరిహద్దులోని నదీతీర ప్రాంతాలలోను, కంచెను నిర్మించలేని ప్రాంతాలలోను ఈ గోడలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.