పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసి, పీవోకేలోని వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చిన ఆపరేషన్ సింధూర్ తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఆయుధ పోటీ పెరిగింది. తాజాగా ఓ ప్రాణాంతక ఆయుధాన్ని భారతదేశం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆ ఆయుధం పేరు రష్యన్ R-37M క్షిపణి అనేదే. ఇది చాలా వేగంగా, ప్రాణాంతకమైన దీర్ఘ-శ్రేణి గాలి నుండి గాలికి దూసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగివుంటుంది. దీని సామర్థ్యాలను చూసి యునైటెడ్ స్టేట్స్, చైనా కూడా వణుకుతాయి.