యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై నిర్మితమైన ఈ సీక్వెల్ టర్కీలోనూ ప్రభంజనం సృష్టించింది. అక్కడి టాప్ టెన్ మూవీ చార్ట్లో స్థానం సంపాదించిన తొలి భారత సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇక, చైనాలో ఇంత భారీ స్థాయిలో రిలీజైన భారత సినిమా ఇదే కావడం గమనార్హం.
చైనా రొమాంటిక్ మూవీ 'ను జువో నో డై' కూడా ధూమ్-3 ధాటికి వెనకబడిపోయిందట. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రీనా కైఫ్, ఉదయ్ చోప్రా నటించారు.