న్యూజిలాండ్ ప్రధానికి జేజేలు.. కరోనా చివరి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యాడోచ్

శుక్రవారం, 29 మే 2020 (19:27 IST)
Newzealand PM
కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డ‌న్స్ అనుసరించిన విధివిధానాలు, ఆమె సమ‌ర్థ‌వంత‌మైన నాయ‌కత్వమే కార‌ణ‌మైంద‌ని ప్ర‌జ‌లు ఆమెకు జేజేలు ప‌లుకుతున్నారు.

క‌రోనా ఉనికి క‌న‌బ‌డ‌గానే లాక్‌డౌన్ విధించ‌డం, ఎక్కువ సంఖ్య‌లో ప‌రీక్ష‌లు చేయ‌డం ఈ గెలుపుకు దోహ‌ద‌పడ్డాయంటున్నారు. ఆ దేశంలో ఆరు కరోనా కేసులు న‌మోద‌వ‌గానే దేశ ప్ర‌జ‌లంద‌రూ రెండు వారాల‌పాటు సెల్ఫ్ ఐసోలేట్‌లో ఉండాల‌ని ప్రధాని జెసిండా పిలుపునిచ్చారు. 
 
బాధితుల సంఖ్య 28కు చేరుకునే స‌మ‌యానికి విదేశాల నుంచి రాక‌పోక‌ల‌పై నిషేధం విధించారు. అంతేకాక దేశంలో 2,67,435 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ 1504 కేసులు న‌మోద‌వ‌గా 22 మంది చ‌నిపోయారు, మిగ‌తా అంద‌రూ కోలుకున్నారు.

ఇలాంటి విష‌మ ప‌రిస్థితుల మ‌ధ్య న్యూజిలాండ్‌ దేశం శుభ‌వార్త తెలిపింది. క‌రోనా నుంచి కోలుకున్న చివ‌రి బాధితుడిని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. కాగా న్యూజిలాండ్ దేశంలో గ‌త వారం రోజులుగా ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ని అక్క‌డి అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు