అయితే, ప్రస్తుతం ఆ ప్రాంతం పాక్లో ఉన్నందున.. యునెస్కో మార్గదర్శకాల ప్రకారం ఆ కళాఖండం తమకే దక్కుతుందని పాకిస్థాన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్స్ డెర్టెక్టర్ జనరల్ సయీద్ జమాల్ షా చెప్పిన్నట్లు పాక్ పత్రికలు కథనం ప్రచురించాయి. దీని తమకు అప్పగించాలని త్వరలోనే భారత్ను డిమాండ్ చేయనున్నట్లు పాక్ తెలిపింది.
ప్రభుత్వ భవనంలో ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్టు భావిస్తుండటంతో సైన్యం వారిని చుట్టుముట్టింది. తొలుత ఉగ్రవాదులు పాంపోర్లోని ఇడిఐ భవనంలో ఉన్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందడంతో వారు ఆ భవనాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సైనికులను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.