మమ్నూన్ అధ్యక్షతన స్నాతకోత్సవం జరపాలని సంస్థ భావించింది. అయితే, ఆహ్వాన పత్రాల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్, మన్మోహన్ సింగ్' అని పేర్కొన్నారు. దున్యా న్యూస్ మీడియా సంస్థ ఈ ఘోరతప్పిదాన్ని ఎత్తిచూపింది. తప్పును గుర్తించి నాలుక్కరుచుకున్న పీఐడీఈ అధికారులు వెంటనే దాన్ని సవరించారు.