అమెరికా ఒత్తిడివల్లో.. ఆత్మాహుతి ఉగ్రవాది దాడిలో వంద మంది సూఫీలు దారుణంగా హత్యకు గురైన ఘటన ప్రభావం వల్లో కాని పాక్ ప్రభుత్వం మేల్కొన్నట్లుంది. ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, పాక్ ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సు గట్టి ఝలక్ ఇచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ఏటీఏ) నాలుగో జాబితాలో అతని పేరును శనివారం చేర్చింది.
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ను ఉగ్రవాద దేశంగా పరిగణించే అవకాశం ఉందని భావించిన పాక్ అధికార యంత్రాంగం హఫీజ్ సయీద్ సహా పలువురిని గతనెల 30న లాహోర్లో గృహ నిర్భందం చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేశం విడిచి పారిపోకుండా ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో కూడా హఫీజ్ను చేర్చింది.