మనుషులకు ఇకపై పందుల అవయవాలు: కిడ్నీ, గుండె మ్యాచ్ అవుతాయట...?

శనివారం, 12 ఆగస్టు 2017 (16:05 IST)
అవయవ మార్పు శస్త్ర చికిత్సల కోసం అమెరికాలో ఒక లక్షా 16వేల 800 మంది ఎదురుచూస్తున్నారు. అవయవదానం ద్వారా మార్పునకు కావాల్సిన అవయవాలు చేతికందకపోవడంతో కొరత ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో పందుల అవయవాలను మనుషులకు అమర్చవచ్చా అనే దానిపై జరిగిన పరిశోధనలో సానుకూల ఫలితం వచ్చింది. పందుల కిడ్నీలు, హృదయాలు వంటి అవయవాలు మనుషులకు సరిపోతాయని వెల్లడి అయ్యింది. 
 
అవయవ మార్పుల కోసం పందుల అవయవాలను భద్రపరిచేందుకు పెర్వ్ అనే వైరస్‌ను ఉపయోదిస్తున్నారు. ఇప్పటి వరకు 37 పందుల అవయవాలు పెర్వ్ వైరస్ ద్వారా భద్రపరిచారు. తద్వారా భవిష్యత్తులో పందుల అవయవాలను మనుషులకు మార్పిడి చేసే ఛాన్సుందని పరిశోధకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి