రష్యాలో విషాదం.. కారు చెట్టును ఢీకొట్టి నలుగురు మృతి

శనివారం, 31 డిశెంబరు 2022 (15:39 IST)
రష్యాలో విషాదం చోటుచేసుకుంది. క్రిమియలోని సింఫరోపోల్‌లో ఓ కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో నలుగురు భారతీయులైన వైద్య విద్యార్థులు మృతి చెందారు. 
 
వీరు ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. 
 
కారు సెర్గీవ్ నుంచి సెన్‌స్కీ వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జుగా మారింది. ఆ కారులో ప్రయాణించిన వైద్య విద్యార్థులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు