బంగాళదుంపల కోసమని వెళ్లిన కుటుంబం మృత్యువాత పడిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. రష్యాకు చెందిన మారియా చెలిషేవా తన తల్లిదండ్రులతో, అన్న, నాన్నమ్మతో కలిసి నివసిస్తోంది. ఒక రోజు బంగాళదుంపలతో ఏదైనా వంటకం చేయాలని భావించారు. అనుకున్నదే తడువుగా తమ ఇంట్లో బేస్మేట్లో భారీగా నిల్వ చేసిన దుంపలు తీసుకోని రావాలని వెళ్లిన మారియా తండ్రి వెళ్ళాడు. అతడు వెళ్ళిన ఎంతసేపటికి రాకపోవడంతో... మారియా తల్లి అన్నలు కూడా వెళ్లారు.
అప్పుడు తెలిసింది విషయం ఏమిటంటే... బేస్మెంట్లో ఉన్న గదిలో చాలా కాలం నుంచి పెద్ద మొత్తంలో బంగాళ దుంపలను నిల్వచేశారు. అవి చూసేసరికి బాగా కుళ్లిపోయాయి. దీంతో బంగాళదుంపల్లో ఉండే గ్లైకోఆల్కలాయిడ్లు విషవాయువులుగా మారి గదిలోకి వెళ్లిన వారు వెళ్ళినట్టే చనిపోయారు. కుళ్లిపోయిన ఆలుగడ్డలు ఆ పాపను అనాథను చేశాయి. మారియాను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం మారియా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు.