అమెరికాలో కాల్పుల కలకలం .. ఆరుగురి మృతి

సోమవారం, 25 జనవరి 2021 (10:54 IST)
ప్రపంచంలో తుపాకీ కల్చర్ అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా ఒకటి. కొందరు దుండగులు జరిపే కాల్పుల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఇండియానాలో ఈ కాల్పులు జరిగాయి. 
 
ఓ ఇంట్లో దుండగులు కాల్పులకు పాల్ప‌డ‌డంతో గర్భిణీ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌ అడ‌మ్స్ స్ట్రీల్ 3500 బ్లాక్‌లో జరిగింది. ఈ ఘటనను ఇండియానాపోలిస్ మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు ప్రారంభించార‌ని వివరించారు. 
 
ఇది చాలా దారుణమైన ఘటన అని, దశాబ్ద కాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని అక్క‌డి పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌నలో మ‌రో మైన‌ర్‌కి తీవ్ర‌గాయాలు కాగా ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంద‌ని పోలీసులు వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆ మైన‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు