సిరియాలో ఆత్మాహుతి దాడి.. 100 మంది మృతి.. 55 మందికి గాయాలు..

ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (14:37 IST)
సిరియాలో శనివారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో వంద మందికి పైగా మరణించారు. సిరియన్లను తరలిస్తున్న బస్సులపై అలెప్పో పశ్చిమ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అమెరికా మద్దతుతో పోరాడుతున్న దళాలు ఐఎస్ బలంగా ఉన్న రాఖా దిశగా బస్సులు వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. 
 
ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సిరియా ఉత్తర ప్రాంతాలైన పువా, కఫ్రయాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. ఈ నేపథ్యంలో ప్రజలను తరలిస్తున్న బస్సులు టార్గెట్‌గా దాడి జరిగిందని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. ఈ ఘటనలో 55 మంది గాయాలపాలయ్యారు.

వెబ్దునియా పై చదవండి