రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి.. 12 మంది మృతి

శుక్రవారం, 14 మే 2021 (20:57 IST)
ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర కాబుల్లో రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘాన్ పోలీసులు తెలిపారు. మరో 15 మందికి గాయాలయ్యాయని చెప్పారు. ఈ పేలుడులో ముస్లిం మతగురువు కూడా మృతి చెందారని పోలీసు ప్రతినిధి ఫెర్డాస్ ఫరామార్జ్ తెలిపారు.
 
మసీదులో ప్రార్థనలు ప్రారంభమయిన వెంటనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. అయితే.. ఈ బాంబు దాడికి తామే బాధ్యులం అంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. కానీ, మతగురువు లక్ష్యంగానే ఈ బాంబు దాడి జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. 
 
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అఫ్గాన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఒప్పందం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు