హసాకే ప్రావిన్స్లోని తాల్ తమర్ ప్రాంతాలపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే దాడులు చేపట్టినట్టు పేర్కొంది. అయితే ఈ దాడుల వల్ల జరిగిన నష్టం వివరాలేవి ఇంకా తెలియరాలేదు. కాగా తాల్ తమర్ చుట్టుపక్కల ఉన్న దాదాపు పది గ్రామాల్లోకి ఐఎస్ ఉగ్రవాదులు చొరబడి వాటిని అదుపులోకి తీసుకుని 220 మంది క్రైస్తవులను బందీలుగా పట్టుకున్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.