ఐఎస్‌ చెరలో క్రిస్టియన్లు... అమెరికా దాడులు ఆరంభం..!

శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (12:09 IST)
ప్రపంచ వ్యాప్తంగా మారణ హోమాలను సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై అమెరికా యుద్ధ విమానాలతో దాడులు ప్రారంభించింది. ఈ విషయాన్ని సిరియన్ హక్కుల సంస్థ వెల్లడించింది. 220 మంది అస్సిరియన్ క్రైస్తవులను ఐఎస్ ఉగ్రవాదులు బంధీలుగా పట్టుకెళ్లిన అనంతరం అమెరికా ఈ దాడులను జరిపినట్టు తెలిపింది.
 
హసాకే ప్రావిన్స్లోని తాల్ తమర్ ప్రాంతాలపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే దాడులు చేపట్టినట్టు పేర్కొంది. అయితే ఈ దాడుల వల్ల జరిగిన నష్టం వివరాలేవి ఇంకా తెలియరాలేదు. కాగా తాల్ తమర్ చుట్టుపక్కల ఉన్న దాదాపు పది గ్రామాల్లోకి ఐఎస్ ఉగ్రవాదులు చొరబడి వాటిని అదుపులోకి తీసుకుని 220 మంది క్రైస్తవులను బందీలుగా పట్టుకున్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి