అమెరికా వీసాలపై కరోనా ప్రభావం.. మే 3 నుంచి అవన్నీ బ్రేక్

బుధవారం, 28 ఏప్రియల్ 2021 (13:53 IST)
అమెరికా వీసాలపై కరోనా ప్రభావం పడింది. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో ఇక్కడి నుంచి వచ్చే వారికి ఆ ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది. యూఎస్‌ కన్సలేట్‌ నుంచి జారీ అయ్యే అన్ని సాధారణ వీసా సర్వీసులతో పాటు రొటీన్‌ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌, ఇంటర్వ్యూ వేవర్‌ అపాయింట్‌మెంట్‌ వీసాలను మే 3 నుంచి నిలిపి వేస్తున్నట్లు కన్సలేట్‌ జనరల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
 
అన్ని రకాల సాధారణ అమెరికన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ అపాయింటెమెంట్‌లను ఈ నెల 27 నుంచే రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, అత్యవసర అమెరికన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ అండ్‌ వీసా అపాయింట్‌మెంట్‌లు మాత్రం కొనసాగుతాయని ఆ ప్రకటన తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చినంతవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని కన్సలేట్‌ జనరల్‌ విడుదల చేసిన ప్రకనటలో వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు