సూర్యుడు చనిపోతే భూమికి ఏమవుతుంది?

సెల్వి

గురువారం, 8 ఫిబ్రవరి 2024 (18:31 IST)
Sun
సూర్యుడు మాయమైతే భూమి ఏమవుతుందో తెలుసా? స్టడీలో షాకింగ్ సంగతులు వెలుగులోకి వచ్చాయి. సూర్యుడిలోని అణు ఇంధనం పూర్తిగా అయిపోయిన తర్వాత, అది ఎలా అదృశ్యమవుతుంది? మన సౌర వ్యవస్థలోని మిగిలిన గ్రహాలకు ఏమి జరుగుతుంది? ఈ సంఘటనలు ఎన్ని బిలియన్ల సంవత్సరాలలో జరుగుతాయో అంచనా వేయడానికి ఖగోళ శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జెడబ్ల్యూఎస్టీ) నుండి డేటాను ఉపయోగించారు.
 
జెడబ్ల్యూఎస్టీ డేటా తెల్ల మరగుజ్జు నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న రెండు గ్యాస్ జెయింట్ ఎక్సోప్లానెట్‌ల చిత్రాలను కలిగి ఉంది. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సుసాన్ ముల్లల్లి ఈ ఆవిష్కరణకు నాయకత్వం వహించారు. 
 
దాని గురించి సుసాన్ తన పోస్ట్‌లో, జెడబ్ల్యూఎస్టీకి చెందిన MIRIతో కనుగొనబడిన రెండు కొత్త క్యాండిడేట్ ఎక్సోప్లానెట్‌ల ఆధారంగా ఈ స్టడీ జరిగింది. ఇవి చల్లని, బిలియన్-ఏళ్ల నాటి బృహస్పతి-వంటి ఎక్సోప్లానెట్‌లు. వాటి తెలుపు మరగుజ్జు నక్షత్రాలు తమ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని చెప్పారు. 
 
సూర్యుడు తెల్ల గ్రహంగా మారిన తర్వాత బృహస్పతి, శని గ్రహాల చుట్టూ తిరుగుతాయి. అవి ఒకటి ఐదు బిలియన్ సంవత్సరాల మధ్య మన స్వంత సౌర వ్యవస్థను పోలి ఉంటాయని చెప్పారు. ఈ అధ్యయనం ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో ప్రచురించబడింది. 
 
ఈ అధ్యయనంలో సూర్యుడు చనిపోతే భూమికి ఏమవుతుంది? అనేదానిపై క్లారిటీ వుంది. అంతరిక్ష సంస్థలు, పరిశోధకుల ప్రకారం, సూర్యుడు చనిపోతే భూమి ఇకపై నివాసయోగ్యమైన గ్రహం కాదు, ఎందుకంటే ఇది అన్ని జీవులకు మూలం. అన్ని మొక్కలు, ఆహార ధాన్యాలు చనిపోతాయి. ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే జంతువుల మరణానికి దారి తీస్తుంది. 
 
చివరికి మొత్తం ఆహార గొలుసుకు అంతరాయం కలిగిస్తుంది. సూర్యుని మరణం భూమిపై అణు శీతాకాలానికి దారి తీస్తుంది. అంటే సూర్యరశ్మి ఉండదు. వాతావరణం అంతిమంగా కలుషితమవుతుంది. అన్ని జీవులు గాలిని పీల్చుకోలేవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు