సెలవు పెట్టకుండా 74 యేళ్ల పాటు విధులు- 90 యేళ్లకు రిటైర్

శుక్రవారం, 7 జులై 2023 (08:46 IST)
కొందరు వ్యక్తులు తమ ఉద్యోగానికే పరిమితమవుతుంటారు. ఇలాంటి వారిలో అమెరికాలోని ఓ మహిళ ఒకరు. ఈమె ఏకంగా 74 యేళ్ల పాటు సెలవు పెట్టకుండా ఉద్యోగం చేసి, తన 90 యేట రిటైర్ అయ్యారు. ఇది వినేందుకు కాస్త నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ వాస్తవం. దశాబ్దాల పాటు ఏకధాటిగా పని చేసిన ఆ మహిళ పేరు మెల్బా మెబానే. టెక్సాస్‌‍లో మేయర్ అండ్ ష్మిడ్ స్టోర్‌లో లిఫ్ట్ ఆపరేటర్‌గా 1949లో ఉద్యోగం ప్రారంభించారు. అ్పటికి ఆమె వయసు కేవలం 16 యేళ్లు మాత్రమే. నాటి నుంచి ఆమె తన ఉద్యోగానికే అంకితమయ్యారు. 1956లో ఆ సంస్థను డిలార్డ్ అనే మరో సంస్థ సొంతం చేసుకుంది. 
 
తన కెరీర్ ఆరంభంలో లిఫ్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరిన ఆమె.. ఆ తర్వాత దుస్తులు, కాస్మెటిక్స్ వభాగంలో ఏకంగా 74 యేళ్ల పాటు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఉద్యోగానికి వెళ్లారు. ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులంతా కలిసి ఆమె భారీ స్థాయిలో వీడ్కోలు పార్టీ ఇచ్చారు ఇకపై తనకిష్టమైన ప్రదేశాలు చూసేందుకు సమయాన్ని కేటాయిస్తానని, ఇందుకు తన శరీరం సహకరించాల్సి వుందని మెబానే చెప్పారు.
 
డబ్బుల సంచితో చెట్టెక్కిన కోతి... ఎక్కడ?  
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక అనూహ్యం ఘటన ఒకటి జరిగింది. రూ.1.5 లక్షల నగదుతో ఉన్న సంచితో ఓ వానరం చెట్టు ఎక్కేసింది. దీంతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. యూపీ రాష్ట్రంలోని షాబాద్‌లోని రిజిస్ట్రీ ఆఫీసుకు హుస్సేన్ అనే వ్యక్తి డబ్బుల సంచితో వచ్చాడు. తన బైకును కార్యాలయం వెలుపల నిలిపాడు. ఈ బైకుకే డబ్బుల సంచిని కూడా తగిలించాడు. కొద్దిసేపటికి బయటకు వచ్చిన అతడు బ్యాగులోని రూ.1.5 లక్షలు కనిపించకపోవడంతో ఖంగుతిన్నాడు. డబ్బు ఉన్న బ్యాగును ఓ కోతి ఎత్తుకునిపోయిందని తెలిసి అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. 
 
ఈ లోపు రంగంలోకి దిగిన స్థానికులు బ్యాంగుతో చెట్టుపై ఉన్న కోతిని ఏమార్చి బ్యాగ కిందకు జారవిడిచేలా చేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. దీంతో హుస్సే‌న్‌కు పోయిన ప్రాణం లేసొచ్చింది. కాగా, ఈ ఘటనపై జిల్లా అధికారులు స్పందించారు. ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
 
తగ్గనున్న వందే భారత్ రైల్ టిక్కెట్ల ధరలు!  
 
దేశంలో వివిధ మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రైళ్ల టిక్కెట్ ధరలు తగ్గనున్నాయి. ఎంపిక చేసిన మార్గాల్లోనే ఈ టిక్కెట్ ధరలు తగ్గుతాయి. నిజానికి ఈ రైళ్లను ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. టిక్కెట్ ధర కాస్త ఎక్కువైనప్పటికీ వేగంగా, సౌకర్యవంతంగా ఉండటంతో ప్రయాణికులు ఈ రైళ్ళలో ప్రయాణించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 46 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని మార్గాల్లో మాత్రం ఈ రైళ్లకు ప్రయాణికుల ఆదరణ లభించడం లేదు. 
 
కొన్ని మార్గాల్లో వందకు వంద శాతం ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఉండగా మరికొన్ని మార్గాల్లో మాత్రం ప్రయాణికుల ఆక్యుపెన్సీ అతి తక్కువగా ఉంది. ముఖ్యంగా భోపాల్ - జబల్ పూర్ మధ్య పరుగులు పెట్టే వందే భారత్ రైలులో ప్రయాణికులే కరువయ్యారు. ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ కేవలం 29 శాతం మాత్రమే. అలాగే, ఇండోర్ - భోపాల్ ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ 21 శాతం, నాగ్‌పూర్ - బిలాస్‌పూర్ ప్రాంతాల మధ్య నడిచే రైలు ఆక్యుపెన్సీ 55 శాతం చొప్పున ఉంది. దీంతో ఈ మార్గాల్లో ప్రయాణ చార్జీని తగ్గించే విషయంపై ఉన్నత స్థాయి అధికారుల మధ్య చర్చ సాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు