ఆఫ్గనిస్థాన్లో గురువారంనాడు జరిగిన ఎన్నికల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పౌరులతోపాటు భద్రతా దళాలకు చెందిన జవాన్లు మొత్తం 26 మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు దేశాధ్యక్షుడిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు ఎన్నికలకు తీవ్ర అంతరాయం కలిగించాలన్న నేపథ్యంలో భాగంగా దాడులకు పాల్పాడ్డారని అధికారులు తెలిపారు,
ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది ఆఫ్గనిస్థాన్ సైనికులు, తొమ్మిదిమంది పోలీసులతోపాటు మరో తొమ్మిదిమంది పౌరులు మృతి చెందినట్లు భద్రతాదళాధికారులు తెలిపారు.
గురువారం జరిగిన ఎన్నికలలో దాదాపు 40 నుంచి 50 శాతం మేరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆఫ్గనిస్థాన్ ఎన్నికల అధికారి తెలిపారు.