పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీతో పాటు.. మరికొందరు అగ్ర నేతలను అంతం చేయాలని పాక్లో తిష్టవేసిన తాలిబన్ తీవ్రవాదులు పథకం రచించారు. ఈ విషయాన్ని ఒక నివేదిక బయట్టబయలు చేసింది. పాక్ సైన్యం చేపట్టిన సైనిక చర్యకు వ్యతిరేకంగా వీరిని అంతమొందించాలని తీవ్రవాదులు కుట్రపన్నారు. తీవ్రవాదుల హిట్ లిస్టులో గిలానీతో పాటు.. పంజాబ్ ముఖ్యమంత్రి షాహబ్జ్ షరీఫ్ కూడా ఉన్నారు.
నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్లోని మలకండ్ డివిజన్, నార్త్ అండ్ సౌత్ వర్జిస్తాన్ ప్రాంతాల్లో తిష్టవేసిన తాలిబన్ తీవ్రవాదులను ఏరివేసేందుకు పాక్ సైన్యం చర్యలు చేపట్టింది. ఈ చర్యకు నిరసనగా పాక్ అగ్రనేతలను హతం చేసేందుకు యాభై ఆత్మాహుతి దళాలను పంజాబ్, నార్త్వెస్ట్ ప్రాంటియర్ ప్రావీన్స్కు పంపినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. సైనిక చర్యపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు.. భద్రతా బలగాలు అరెస్టు చేసిన మిలిటెంట్లను విడుదల చేయడం ఈ భద్రతా దళాల ప్రధాన చర్యగా ఉంది.