తైవాన్‌లో వరద భీభత్సం: 12 మంది మృతి

మొరాకోత్ తుపాను కారణంగా తైవాన్‌ను భారీస్థాయిలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత అర శతాబ్దంలోనే తైవాన్‌లో ఈ స్థాయిలో వరదలు ముంచెత్తుతుండటం ఇదే తొలిసారి. తుపాను కారణంగా సంభవించిన వరదల్లో 12 మంది మృతి చెందగా, 52 మంది ఆచూకీ గల్లంతైంది.

కూలిపోయిన బ్రిడ్జిలు, పొంగిపొర్లుతున్న నదులు కారణంగా సంబంధాలు తెగిపోయి వరదల్లో చిక్కుకున్న వేలాది మంది పౌరులను రక్షించేందుకు తైవాన్ మిలిటరీ రంగంలోకి దిగింది. మొరాకోత్ తుపాను కారణంగా తైవాన్‌లో 2.5 మీటర్ల వర్షపాతం నమోదయింది. తైవాన్‌ను దాటివెళ్లిన ఈ తుపాను ఆదివారం చైనా తూర్పు తీరాన్ని తాకింది. చైనాలోనూ తుపాను కారణంగా భారీ నష్టం వాటిల్లింది.

వెబ్దునియా పై చదవండి