అమెరికా ఆర్థిక రంగం క్రమంగా నిలదొక్కుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో గణనీయంగా మార్పులు వచ్చినట్టు ఆయన తెలిపారు.
ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభం కారణంగా మొదట్లో ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లో ఉండగా.. ఇప్పుడది సగానికి సగం తగ్గిందని చెప్పుకొచ్చారు. కాని దేశ ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగు పడాలని, అప్పుడే పూర్తిగా కోలుకుందని భావించలేమని ఒబామా తెలిపారు.
ఒబామా అధ్యక్ష పదవి చేపట్టేనాటికి ఆర్థిక మాంద్యం ప్రభావం అమెరికాపై తీవ్రంగా ఉన్న విషయం తెల్సిందే. పలు బ్యాంకులు దివాళా తీయగా, జనరల్ మోటార్స్ వంటి కంపెనీలు మూతపడ్డాయి. దీంతో ఆర్థిక రంగాన్ని ప్రక్షాళన ఒబామా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.