సరైన ఆధారాలతో వస్తే జాబితా ఇస్తాం: స్విస్ బ్యాంక్

మంగళవారం, 25 ఆగస్టు 2009 (20:43 IST)
స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో అక్రమంగా నల్లధనం దాచుకున్నట్టు భావిస్తున్న వారికి స్పందించి భారత ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలతో ముందుకు వస్తే మాత్రం జాబితా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్విస్ బ్యాంకు అధికారులు మంగళవారం అభిప్రాయపడ్డారు. డబ్బు దాచుకున్న వారి వివరాలను గుడ్డిగా అడిగితే ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

అమెరికా పౌరులకు చెందిన స్విస్ బ్యాంకు అకౌంట్ల వివరాలను అందించేందుకు ముందుకు వచ్చిన స్విస్ బ్యాంకు అధికారులు భారత్ విషాయానికి వచ్చే సరికి వెనకడుగు వేసిన విషయం తెల్సిందే. నిర్ధిష్టమైన సమాచారం లేదా ఆధారాలతో వస్తే మాత్రం వారికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్విస్ అధికారులు వెల్లడించారు.

స్విస్ బ్యాంకుల్లో అనేక మంది భారతీయులు లక్షల కోట్ల రూపాయలను దాచుకున్నారని, అందువల్ల ఆ ధనాన్ని వెలికి తీయాలని పలువురు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై స్పందించిన కేంద్రం.. ఈ విషయంలో చొరవ చూపించి తగిన విధంగా చర్యలు చేపడుతామని ప్రకటించింది.

అయితే, స్విస్ బ్యాంకు అధికారులు సోమవారం చేసిన ప్రకటనతో ఇది సాధ్యమయ్యేలా కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ.. స్విస్ ఖాతాల వివవరాల వెల్లడి కోసం బ్యాంకు అధికారులతో మళ్లీ చర్చలు జరుపనున్నట్టు ప్రకటించారు. దీంతో మంగళవారం సానుకూలంగా స్పందించింది.

వెబ్దునియా పై చదవండి