సీఐఏ వేధింపులపై అమెరికా దర్యాప్తు

అమెరికా గత అధ్యక్షుడు జార్జి బుష్ హయాంలో బందీలను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐఏపై ఆ దేశ ప్రభుత్వం తాజాగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. తీవ్రవాదంపై పోరు పేరుతో నిర్బంధించినవారిని తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు సీఐఏ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వేధింపులపై అమెరికా అధ్కక్షుడు బరాక్ ఒబామా దర్యాప్తుకు ఆదేశించారు.

సీఐఏ పరిశోధకులు ఓ తీవ్రవాద అనుమానితుడి పిల్లలను చంపుతానని బెదిరించారని, మరో అనుమానితుడి తల్లిని లైంగిక వేధించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐఏ చేపట్టే తదుపరి దర్యాప్తుల్లో మార్పులు చేయాలని బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఐఏతోపాటు, ఇతర సంస్థలను ఎఫ్‌బీఐ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిని తన జాతీయ భద్రతా సలహాదారు పర్యవేక్షించేలా చేశారు.

వెబ్దునియా పై చదవండి