ప్రపంచవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 1462కి చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. భూమిపై దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాల్లో స్వైన్ ఫ్లూ తీవ్రత తగ్గుముఖం పడుతోందని, అయితే భారత్తోపాటు, ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో వ్యాధి తీవ్రరూపం దాలుస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ఈ మహమ్మారి దక్షిణార్ధగోళంలోని అనేక దేశాల్లో తగ్గుముఖం పడుతోందని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి ఒకరు జెనీవాలో విలేకరులతో చెప్పారు. అర్జెంటీనా, చిలీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టిందని నిర్ధారణకు వచ్చామన్నారు.
థాయ్లాండ్, వియత్నాం, భారత్ వంటి ఆసియా దేశాల్లో వ్యాధికారస వైరస్ వ్యాధి ఉధృతంగా ఉందని తెలిపారు. జులై 11న స్వైన్ ఫ్లూ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 177457 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయినట్లు సంస్థ ధృవీకరించింది.